Sunday, April 28, 2024

TS: లక్ష్మీ కెనాల్ ఆయకట్టు రైతులకు ఆఖరి తడికి సాగునీరివ్వాలి.. వేముల ప్ర‌శాంత్ రెడ్డి

బాల్కొండ : ముప్కాల్ మండలంలోని లక్ష్మీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న పంటలను బ్రతికించుకోవడానికి లక్ష్మీ కెనాల్ నీటి విడుదలను కొనసాగించాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్.ఈ, సీఈ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రైతుల కోరిక మేరకు రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున చివరి తడిగా 10రోజుల పాటు 0.3టీఎంసీ నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులు, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినకుండా ఈ ప్రభుత్వం నీటి అలకేషన్ లేని ప్రాంతాలకు వరద కాలువ ద్వారా 4 టీఎంసీలు క్రిందికి విడిచి అలకేషన్ ఉన్నటువంటి లక్ష్మీ కెనాల్, చౌట్పల్లి హనంత్ రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ ల ఆయకట్టులోని రైతన్నలకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తుంది. ఏది ఏమైనా లక్ష్మీ కెనాల్ ద్వారా ఆఖరి తడి కోసం నీటి విడుదలను కొనసాగించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement