Sunday, April 28, 2024

TS : రూ.25 ల‌క్ష‌ల ఫేక్ క‌రెన్సీ ప‌ట్టివేత

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠాలు బయట పడుతున్నాయి. ఇవాళ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇది, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కారులో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు అడ్డంగా దొరికిపోయారు.

- Advertisement -

బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట దగ్గర అనుమానంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా అందులో 25 లక్షల నకిలీ కరెన్సీ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడింది.
ఇక, నిందితులు మూడింతల నకిలీ కరెన్సీ ఇచ్చి ఒకింత ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. కాగా, షేక్ హరుణ్, సయ్యద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితులంతా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారిగా ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి చిల్ద్రెన్ బ్యాంక్ కు సంబంధించిన 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీతో పాటు నిస్సాన్ కంపెనీకి చెందిన కారు, నాలుగు మొబైల్ ఫోన్స్ కీ ప్యాడ్ మొబైల్, 8240 వేల ఒరిజినల్ కరెన్సీ రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement