Saturday, April 27, 2024

టెట్‌ ఫలితాలపై స్పష్టత కరువు..!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ముందస్తు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈరోజు టెట్‌ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఫలితాల విడుదలపై ఆదివారం రాత్రి వరకు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఎప్పుడు ప్రకటిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఆదివారం తెలిపారు.

మంగళవారం ఇంటర్‌ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టెట్‌ ఫలితాల ప్రకటన కాస్త ఆలస్యం కానున్నట్లు సమాచారం. టెన్త్‌ ఫలితాలు కూడా ఈనెల 30 లేదా జులై 1న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఇంటర్‌, టెన్త్‌ ఫలితాల తర్వాతే టెట్‌ ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement