Sunday, May 5, 2024

సర్వం శివార్పణం…

తమిళనాడు సముద్ర తీరంలో ‘నాగపట్నం’ అనే ఊరు ఉంది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. అక్కడ ఒక జాలరివాడు మహాశివ భక్తుడు. ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు.
జాలర్లందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయ నకి వచ్చిన మొదటి చేపని ‘శివార్పణం!’ అని సముద్రం లో వేసేవాడు. ఆ తర్వాత పట్టిన చేపలన్నీ తను తీసుకునే వాడు. ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం.
నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింప జేస్తుం ది. శివ భక్తి, శివప్రేమ, శివార్పణం ఇలాంటి శివుడితో కలి సిన ఏ మాటకైనా అందం వస్తుంది. ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం! ఇతడు జాలరి వాళ్ళకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలినవాళ్ళు దానికే కట్టు ఉండా లి. శివభక్తుడు నాయకుడిగా చేపలు పడుతూ సంపద లన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు.
ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతోదూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్యభోజనాలకీ, కుటుంబపోషణలకీ అయిపోయాయి. చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళి సముద్రంలో వల వేశారు. శివభక్తుడు వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది. దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా ఎప్పుడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది.
కానీ ఇతనికున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం. పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ పడింది ఒకటే చేప. అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే నాయకుడు మొదటి చేపను శివార్పణం అని వేస్తాడని వాటు వాళ్ళందరికీ తెలుసు. నాయకుడు కాబట్టి ఆ బంగారు చేపను వేయవద్దు అని చెప్పలేరు. కానీ దాన్ని ఏం చేస్తాడో అని ఆవేదన చెందారు. వచ్చిం ది శివార్పణం ఇవ్వకపోతే ఏమౌతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే నాయకుడు రోజూ శివార్పణం చేయడానికి చేప లేదు అని బాధపడేవాడు. అదీ భక్తి అంటే!
శివభక్తుడి ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చా ను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరి కింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. చేపను పైకి తీశాడు. అందరికి భయం వేసింది. చేపను సముద్రంలోకి వేయ వద్దు అని నాయకుడి కాళ్ళుపట్టుకుని ప్రాధేయ పడ్డారు.
వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి. ఆ శివుడికి అర్పిస్తు న్నాను అని తీసుకొని ‘శివార్పణం’ అని సముద్రంలో వేశాడు. అంతే వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహా కాంతి పుంజం కనిపించింది. ఆ కాంతిపుంజ మధ్యంలో వృషభవా#హనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వ రుడు దర్శనమిచ్చి ”నీ భక్తికి మెచ్చాను!” అంటూ నాయ కునితో పాటు మిగిలిన జాలర్లు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడు.
‘ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించి పోతాం!’ అని చెప్పడం. ‘స్వయం తీర్త్వా పరాన్‌ తార యతి’ తాను తరించడమే కాకుండా ఎందరినో తరింప జేశాడు. ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవ మూర్తిని ఇక్కడికి తెస్తారు. ఆ జాలరి వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది.
కొంతమంది భగవంతుడి దయవల్ల సంపాదించి మాటిమాటికీ అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చా డని. కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమౌతుందో అనే భయం వాళ్ళకి. ఒకళ్ళకి ఇవ్వడానికి, దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు.
‘అర్పణకి’ సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి.
ఓం నమ:శ్శివాయ:

Advertisement

తాజా వార్తలు

Advertisement