Wednesday, May 22, 2024

TS : మరోసారి అమిత్​షా పర్యటన… ఎంపీ అభ్యర్థుల మద్దతుగా ప్రచారం

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నేడు రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తరపున నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం కాగజ్‌నగర్‌లో జరగనున్న బీజేపీ వికాస సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారు.

- Advertisement -

అనంత‌రం అక్క‌డి నుంచి నిజామాబాద్‌కు చేరుకొని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌కు మద్దతుగా గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. నిజామాబాద్‌ సభ ముగించుకొని రాత్రికి సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement