Sunday, April 28, 2024

KHM: గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం..

పినపాక, పిభ్రవరి 24(ప్రభ న్యూస్): మండలంలోని గోదవరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతరెడ్డి పాలెం పంచాయతీలోని చింతల బయ్యారం గ్రామంలోని, గోదావరి నదిలో గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కోట్టుకువచ్చింది.

ఆ ప్రాంతంలోకి వెళ్ళిన సదురు వ్యక్తులు గమనించి ఏడూళ్ళ బయ్యారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకోని మృతదేహన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహంపై దుస్తులు లేవు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement