Sunday, April 28, 2024

IND vs ENG, 4th Test : రూట్ సెంచరీ, రాబిన్ సన్ హాఫ్ సెంచరీ… 353 కు ఇంగ్లండ్ ఆలౌట్..

భారత్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో శనివారం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ అజేయంగా 122 పరుగులు చేయగా, ఆలీ రాబిన్సన్ (58) తన తొలి టెస్టులో యాభై పరుగులు చేశాడు.

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 306 పరుగులకు 7వికెట్లు ఇంగ్లండ్ జట్టు కోల్పోయింది. ఇవాళ ఉదయం నుంచి ఆలౌట్ అయ్యే వరకు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు జో రూట్ సెంచరీ, ఆలీ రాబిన్ సన్ హఫ్ సెంచరీతో పాటు ఫోక్స్ 47 పరుగులు, జాక్ క్రాలే 42 పరుగులు, జానీ బెయిర్ స్టో 38 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, ఆకాష్ దీప్ మూడు వికెట్లు, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement