Saturday, May 4, 2024

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్మ…

పటాన్‌చెరు, (ప్రభ న్యూస్‌) : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం తెల్లవారుజామున పటాన్‌ చెరు మండలం బీడీఎల్‌ బానూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులు వాసుదేవ(27), రేఖ (28), సోనం(2)గా గుర్తించారు. వదిన భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకొని విషయం భర్తకు తెలియడంతో రెండేళ్ల బిడ్డతో సహా మరిది, వదినలు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా భానూర్‌లో వలస కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త రోజు కూలీ పనికి వెళ్లడంతో మరిది రేఖ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం భర్తకు తెలియడంతో తమ్ముడు వాసుదేవ, భార్య రేఖను మందలించాడు. దీంతో ఏం జరిగిందో తెలియదు. కానీ భర్త నిద్రిస్తున్న సమయంలో మరిది, వదిన, రెండేళ్ల బిడ్డ సోనంలు గురువారం ఉదయం గదిలో ఉరి వేసుకొని విగత జీవులుగా కనిపించారు. అయితే భర్త మాత్రం పక్కగదిలో నిద్రపోయిన సమయంలో ఈ సంఘటన జరగడంపై పోలీసులు పలు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. హత్య? లేక ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement