Monday, May 6, 2024

భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి గోదారిలో దూక‌బోతుంటే.. మ‌హిళ‌ను కాపాడిన పోలీసులు

భద్రాచలం, (ప్రభ న్యూస్): భర్తతో గొడవపడి గోదావరినదిలో దూకడానికి వెళ్తున్న మహిళను భద్రాచలం పోలీసులు ఇవ్వాల (శ‌నివారం) కాపాడారు. మ‌హిళ‌ను కాపాడిన వారిలో పోలీసు కానిస్టేబుల్స్‌ ప్రసాద్, శ్రీనివాస్, సురేష్, రామనాధం, రాజేష్ కన్న ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం భద్రాచలంలోని అశోక్ నగర్ కొత్త కాలనీకి చెందిన ఒక మహిళ తన భర్త మందలించాడని మనస్తాపం చెంది గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని య‌త్నించింది. ఈ క్రమంలో డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళను కాపాడారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement