Tuesday, May 14, 2024

Exclusive | మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడని.. భర్త సీక్రెట్ పార్ట్స్‌ కోసేసిన రెండో భార్య!

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. నందిగామలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని.. రెండో భ‌ర్యా అత‌ని మర్మాంగాలను కోసేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో ఈ ఘటన జ‌రిగింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ త‌ర్వాత‌ ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళలో నివాసం ఉంటున్నారు.

అయితే.. గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం వీడియోలు చూస్తుండగా.. అది గ‌మ‌నించిన వరమ్మకు చిర్రెత్తుకొచ్చింది. తనను పెళ్లి చేసుకుని, ఆమె వీడియోలు ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబుపై మండిపడింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. కాగా, ఆనంద్ బాబుపై ఆ మ‌హిళ బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడకు తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement