Thursday, May 2, 2024

KHM: బీఆర్ఎస్ అసమ్మతి నాయకుడు గణేష్ ఆస్తుల ధ్వంసం

ఇల్లందు…. ఇల్లందు మున్సిపాలిటీ అసమ్మతి వార్డు సభ్యుల అసమ్మతి నాయకుడు కొండపల్లి గణేష్ కు చెందిన ఆస్తులను అటవీ శాఖ, పోలీస్ అధికారులు ఈరోజు ధ్వంసం చేశారు. సర్వే నెంబర్ 549లోని 12 ఎకరాల 14కుంటల భూమి అటవీశాఖకు చెందిందని, అందులో వున్న ఇండ్లు, షెడ్లు, విలువైన ఆస్తులను నేలమట్టం చేశారు.

ఇటీవల మున్సిపల్ చైర్మన్ డీవీపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విశయంలో గణేష్ కీలకంగా పనిచేశారని దీనికి ప్రతీకార చర్యలో భాగంగానే గణేష్ కుటుంబ సభ్యుల పేర్ల మీద వున్న ఈభూములపై తెల్లవారుజామున, పోలీస్, ఫారెస్ట్, సిబ్బంది, సుమారు 200మంది బందోబస్తు మధ్య ఆస్తులను ద్వసం చేశారు. ఈ సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సందర్శించి జరిగిన ఘటనను ఖండించారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ఎమ్మేల్యే కోరం కనకయ్యలు కలిసి ప్రతిపక్ష బీఅర్ఎస్ వార్డు సభ్యుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement