Wednesday, May 29, 2024

పాము కాటుకు ఒక‌రి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెనగడప పంచాయతీ పరిధిలోని ములుగు గూడెం పాలవాగు గుంపులో నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను కట్లపాము కాటేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఈడిమే అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. భీమే, రామే అనే మహిళలను కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు రలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement