Tuesday, July 23, 2024

AP | అజ్ఞాతం వీడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..

ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన పిన్నెల్లి ఎస్పీ కార్యాలయంలో బెయిల్ షరతులపై సంతకం చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతి రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించింది. కోర్టు ఆర్డర్‌తో ఎట్టకేలకు ఇవాళ ఎస్పీ కార్యాలయానికి అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు నరసరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement