Wednesday, May 8, 2024

చివ‌రి రోజున మంత్రి పువ్వాడ అజ‌య్ సుడిగాలి ప్ర‌చారం…

ఖ‌మ్మం: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొన్ని గంట‌ల‌లో తెర‌ప‌డ‌నున్న నేప‌థ్యంలో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ప్ర‌చారాన్ని మరింత ముమ్మ‌రం చేశారు.. ఖ‌మ్మంతో పాటు జిల్లాలో సుడిగాలిలా ప‌ర్య‌టిస్తూ టిఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి ఓటు వేయ‌వ‌ల‌సిందిగా అభ్య‌ర్ధిస్తున్నారు.. కాగా, ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖ‌మ్మంలో జ‌రిగిన ఆత్మీయ సమావేశంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సతీమణి నీలిమతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ‌ అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పింది, చెప్పనిది కూడా చేస్తున్నారని తెలిపారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఉపాధి విషయంలో ఎక్కడా లోటు రానీయలేదని చెప్పారు. సాంకేతిక రంగాన్ని ఖమ్మం గుమ్మంలోకి తీసుకొచ్చామని వెల్లడించారు. పట్టణంలో ఐటీ హబ్‌ను ఏర్పాటుచేసి జిల్లా వాసులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement