Saturday, May 4, 2024

Khammam: అమెరికాలో దుండగుడి దాడిలో గాయపడ్డ ఖమ్మం విద్యార్థి మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో దుండ‌గుడి కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖ‌మ్మం విద్యార్థి మృతిచెందాడు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ (29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. గత నెల 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు.

దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిని కడచూపు చూసుకునే వీలు కల్పించాలని.. వరుణ్ మృతదేహాన్ని భారత్​కు రప్పించాలని అతడి తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement