Sunday, May 19, 2024

రాజన్న ఆలయంలో కిక్కిరిసిన భక్తజనం

వేములవాడ: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం రోజున భక్తజనంతో కిక్కిరిసి పోయింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలతోపాటు- పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జామున పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఆదివారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోవిడ్‌ నిబంధనల ప్రకారం దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు- ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement