Monday, May 6, 2024

వ్యాకినేషన్ పై కేంద్రం కీలక ఆదేశాలు

దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ను 6 నుంచి 8 వారాల వరకు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. అయితే, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ను యథాతథంగా వేయాలని పేర్కొంది.

ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం.. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు వేస్తున్నారు. అంటే.. 4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు అందిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ సెకండ్ డోసు గ్యాప్‌ను 28 రోజుల నుంచి 6 నుంచి 8 వారాలకు పెంచాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement