Sunday, May 12, 2024

LMD ప్రాజెక్టుకు భారీగా వరద.. పెరిగిన నీటిమట్టం..

లోయ‌ర్ మానేరు డ్యామ్‌(LMD) ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కాగా నీటి మట్టం 20 టీఎంసీలు దాటింది. భారీ వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌డంతో LMD గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున LMD పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల ,బర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement