Saturday, September 21, 2024

కలెక్టరేట్ ను ముట్టడించిన నాగర్ కర్నూల్ వీఆర్ఏ జేఏసీ

ముఖ్యమంత్రి హామీ జీవో వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ను ముట్టడించారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సమస్య పట్ల సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరి నశించాలన్నారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement