Tuesday, May 14, 2024

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ట్రినిటీ విద్యార్థులు

పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ హై స్కూల్ లో చదువుతున్న 7 వ తరగతి విద్యార్థి పి.అక్షిత ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జార్ఖండ్ లో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రినిటీ విద్యా సంస్థల్లో చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్య తను ఇస్తామని, విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రణధీర్, పిఈటిలు షఫీ, కిషోర్, భూపతి, వెంకటేష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement