Sunday, April 28, 2024

Breaking : AP మంత్రి ర‌జినికి హైకోర్టు నోటీసులు..

ఏపీ మంత్రి విడదల రజినీకి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఎస్ఓ జారీ అంశంపై మంత్రి రజినీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాపరెడ్డికి కూడా ఉన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మడకపొడిలో 90 ఎకరాలు అసైన్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ విడదల రజినీతో పాటు స్థానిక తహసిల్దార్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాల పాటు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement