Wednesday, May 1, 2024

KNR: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు… కలెక్టర్, సీపీ

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే కటిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు హెచ్చరించారు. గురువారం జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… ప్రజలు 50వేల కంటే మించి నగదు తీసుకెళ్లరాదని, ఒకవేళ తీసుకు వెళ్లాల్సి వస్తే సంబంధిత రసీదులు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. లేకపోతే అట్టి సొమ్మును సీజ్ చేస్తామన్నారు. మద్యం, నగదు రవాణా నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement