Wednesday, May 22, 2024

Parigi – బిఆర్ఎస్ కారు దిగి హ‌స్తం గూటికి చేరిన కమతం శ్రీనివాస్ రెడ్డి..

పరిగి అక్టోబర్ 12 ( ప్రభ న్యూస్ ) – జీ మంత్రి స్వర్గీయ కమతం రామ్ రెడ్డి కుమారుడు మాజీ డిసిసిబి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుత ఉమ్మడి గండేడ్ మండల పిఎసిఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సొంత గూటికి కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఎంతో ఆనందంగా ఉందని, కెసిఆర్ ను నమ్మి ప్రజలు మోసపోయారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement