Monday, July 22, 2024

Tirumala ఎపి కొత్త ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త కొన‌సాగిస్తాం – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తిరుమ‌ల‌లో తెలంగాణ త‌ర‌పున క‌ల్యాణ మండ‌పం
భ‌క్తుల వ‌స‌తి గృహం నిర్మిస్తాం..
దీనిపై కొత్త ముఖ్య‌మంత్రితో చ‌ర్చిస్తాం..
తిరుమ‌ల‌లో మీడియాతో రేవంత్ రెడ్డి

తిరుమల – ఎపిలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో , ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.


అనంద‌రం ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయ నూతన ప్రభుత్వ సహకారంతో, ఉభయ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి, ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. అలాగే తిరుమలలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు, నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి, రైతాంగం సస్యశ్యామలం కావాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement