Wednesday, May 15, 2024

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి : ప్రశాంత్ రెడ్డి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఓదెల మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగొని శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓదెల, కాల్వశ్రీరాంపుర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… యువత చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, ఆకుల మహేందర్, ఆళ్ల రాజిరెడ్డి, డాక్టర్ సతీష్, బోడకుంట చిన్నస్వామీ, బోడకుంట నరేష్, పోలోజు రమేష్, జిల తిరుపతి, అల్లం సతీష్, కుమార్ యాదవ్, వెంకటస్వామి, మొగిలి, కుమార్, సర్వర్, అనిల్, సునీల్, రవికుమార్, మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement