Saturday, April 27, 2024

ఎస్‌పి రాంరెడ్డికి సన్మానం..

ఎల్లారెడ్డిపేట: వీర్ణపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన భూక్యా రాంరెడ్డికి ఇటీవల నాన్‌ క్యాడర్‌ ఎస్‌పిగా పదోన్నతి లభించడంతో పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు. వీర్ణపల్లి మండలానికి పాత్రికేయుడు, ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన గుర్రం శివకుమార్‌ కోరిక మేరకు ఎస్‌పి భూక్యా రాంరెడ్డి బొప్పాపూర్‌లోని శివకుమార్‌ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌పి రాంరెడ్డిని శివకుమార్‌, కోరుట్లపేట ఎంపిటిసి సింగారపు మధు, బొప్పాపూర్‌ గ్రామ టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మనవేని కృష్ణలు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌పి రాంరెడ్డి జర్నలిస్ట్‌ శివకుమార్‌ మిత్రులు రామ సాయి, గంట కిరణ్‌, సన్ని, హుజేర్‌, వెంకటరాజులతో గ్రూప్‌ ఫోటో దిగారు. అనంతరం శివకుమార్‌ కుటు-ంబ సభ్యులతో కలిసి ఎస్‌పి దంపతులు ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఎస్‌పి రాంరెడ్డి పలువురికి అభివాదం చేసి గర్జనపల్లికి తిరిగి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement