Wednesday, May 29, 2024

వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని తారుపల్లి గ్రామంలో గల శివాలయ3వ వార్షికోత్సవ సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మంగళహారతులతో శివాలయ సన్నిధికి కుటు-ంబ సమేతంగా చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందించారు. శివపార్వతుల కళ్యాణం లో ధర్మాచార్య నరెడ్ల సదయ్య, తిరుమల దంపతులు, యాంసాని ఎంకన్న, పద్మ దంపతులతోపాటు సర్పంచ్‌ బైరం రమేష్‌, మాజీ సర్పంచ్‌ ఒద్ది గోపాల్‌కిషన్‌రావు దంపతులు, ఆలయ పురోహితులు నిట్టూరి సతీష్‌శర్మ, స్వాగ్‌విన్‌ శర్మ, ఉపసర్పంచ్‌ శిరీషకుమార్‌ ,వార్డు మెంబర్లు, యంసాని సురేష్‌, బొల్లి ప్రేమ్‌ కుమార్‌, బొల్లి రాజేష్‌, ములుగురి శ్రీరక్షణ, రవి, రాజ్‌ కుమార్‌, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement