Wednesday, May 22, 2024

అనారోగ్యంతో వ్యక్తి మృతి..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల గొల్లపల్లికి చెందిన అందె పెద్దెల్లి నర్సయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. బతుకుదెరువు కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా కొస్గి గ్రామానికి వలస వెళ్లిన నర్సయ్య 20 ఏళ్లుగా ఉపాధి పొందుతున్నాడు. అనారోగ్యం కారణంగా మృతిచెందగా నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. దాతలు స్పందించి పేద కుటుంబానికి చేయూతనందించాలని గ్రామస్తులు కోరారు. కాగా, మండలానికి చెందిన పాత్రికేయుడు, జిల్లా ప్రతినిధి పంజా సంపత్‌కుమార్‌ స్పందించి ఆర్థికసాయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement