Saturday, April 27, 2024

సీతారాముల కల్యాణం..రథోత్సవం రద్దు

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 21న శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా జరిగే భక్తోత్సవ కల్యాణం, రథోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్‌ తెలిపారు. గత మార్చి 31న శివక కల్యాణోత్సవం పూర్తి అంతర్గతంగా తగిన బందోబస్తుతో నిర్వహించినా భక్తుల రద్దీని నియంత్రించడం సాధ్యం కాలేదని, తద్వారా వేలాది మంది భక్తులు రోడ్డుపై గుమిగూడినట్లు వివరించారు. ఈ కారణంగా ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు భక్తుల దర్శనం, కోడె మొక్కు, ఇతర పూజా కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయా తేదీల్లో భక్తులకు దేవస్థానం ధర్మశాలలో గదుల కేటాయింపు జరగదని, భక్తులు గమనించి సహకరించాలని కోరారు. కాగా, ఆన్‌లైన్‌ ద్వారా మొక్కుబడి పూజలకు సదుపాయం కల్పించామని, భక్తులు టీఎస్‌ మీసేవ 2.0 లేదా టీ యాప్‌ ఫోలియో ద్వారా మొక్కుబడుల రుసుము చెల్లిస్తే వారి గోత్రనామాలపై మొక్కుబడి పూజలు జరిపిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement