Tuesday, May 7, 2024

‘డ్రైవర్ జమున’ గా ఐశ్వర్య రాజేష్

కౌశల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో పాటు నటన పరంగా ఐశ్వర్య కు మంచి పేరుని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. కాగా తాజాగా మరో సినిమాను స్టార్ చేసింది ఈ అమ్మడు. ఇందులో డ్రైవర్ జమునగ కనిపించనుంది.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ చిత్రానికి కిన్స్ లిన్ దర్శకత్వం వహిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ మధ్యతరగతికి చెందిన యువతి టాక్సీ డ్రైవర్ గా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తుందో చూపించనున్నారు. ఇక గతంలో కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో పాటు వరల్డ్ ఫేమస్ లవర్. మిస్ మ్యాచ్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఐశ్వర్య. ప్రస్తుతం టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement