Monday, April 29, 2024

కరోనా ఎఫెక్ట్: రాజన్న దర్శనాలు రద్దు

తెలంగాణలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో వేములవాడ రాజ‌న్న ఆల‌యంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనాన్ని నిలిపివేయనున్నారు. దర్శనాలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ అధికారులు అనుమ‌తి నిర్ణయం చేశారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వ‌ర‌కు ఆల‌యాన్ని మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ నెల 21న రాజ‌న్న స‌న్నిధిలో అర్చ‌కుల స‌మ‌క్షంలోనే సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు. స్వామి వారి నిత్య పూజ‌లు, సీతారాముల క‌ల్యాణం అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించేందుకు అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement