Friday, April 26, 2024

వైసీపీపై సీఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వర్చువల్ విధానంలో వారు తమ ఫిర్యాదును సీఈసీకి నివేదించారు. తిరుపతి బరిలో పోలింగ్ భద్రత, తదితర అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను రాజకీయ లబ్దికి వినియోగిస్తున్నారని బీజేపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.

అటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పోటీకి అనర్హుడని సీఈసీకి వివరించామని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. గురుమూర్తి అన్యమతానికి చెందిన వ్యక్తి అనేందుకు తగిన ఆధారాలను అందజేశామన్నారు. గురుమూర్తి అనర్హత అంశంపై విచారణ జరపాలని కోరామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement