Tuesday, May 7, 2024

క్వార్టర్ల కోసం కౌన్సిలింగ్…

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా ఓసీపీ1, జీడీకే 11 ఇంక్లయిన్‌లో పని చేసే ఉద్యోగులకు 8వకాలనీలోని సీఈఆర్‌ క్లబ్‌లో క్వార్టర్‌ మార్పిడి కోసం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా 710 క్వార్టర్లకుగాను 147 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా కౌన్సిలింగ్‌కు 56 మంది హాజరయ్యారు. ఇందులో 49 మంది క్వార్టర్లను మార్పిడి చేసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం సాంబయ్య, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, డీజీఎం, అధికార ప్రతినిధి ప్రదీప్‌కుమార్‌, ఈఈ సివిల్‌ పర్వతగిరి రాజు, డిప్యూటి పర్సనల్‌ మేనేజర్‌ చంద్రమౌళి, సీనియర్‌ పర్సనల్‌ అధికారి వంశీధర్‌, క్వార్టర్స్‌ ఇన్‌చార్జి శేషులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement