Tuesday, May 14, 2024

సమాజ సేవకులు పెద్ది వెంకటేష్ కు డాక్టరేట్

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సమాజ సేవకులు పెద్ద వెంకటేష్ కు ఇంటర్నేషనల్ కౌన్సిల్ మరియు ఆసియా వేదిక్ కల్చరల్ ఫౌండేషన్ డాక్టరేట్ అందజేసింది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ లోని క్లరిష్ట హోటల్ నందు శనివారం పెద్ది వెంకటేష్ కు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవల్ని కొనియాడుతూ, వారి కృషిని అభినందిస్తూ సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ అందుజేసింది.

ఈ కార్యక్రమంలో రచయిత సినీ దర్శకులు శుభశ్రీ రాజన్, నిర్వాహకులు నంబిరాజు, మాజీ శాసనసభ్యులు మనోకరన్ మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన సమాజ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement