Monday, April 29, 2024

ప్రారంభమైన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటలు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వజ్రోత్సవాల పేరుతో వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 17నుంచి ఏడాది పాటు నిర్వహించేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement