Tuesday, May 14, 2024

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం.. 10 లక్షల మందికి కొత్త‌ పింఛన్ల మంజూరుపై హర్షం

స్వాతంత్ర్య‌ వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మందికి కొత్త‌గా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం సాయంత్రం నియోజకవర్గంలోని హరిపురం గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగస్టు 15వ తేదీ నుండి 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఇవ్వాల ప్ర‌క‌టించ‌డం
హర్షణీయమన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండేటి మధు యాదవ్, వార్డు సభ్యులు గుండేటి సదయ్య, టిఆర్ఎస్ నాయకులు బొంకూరి రాజు గుండేటి మహేందర్, గుండేటి శంకర్, గంధం ప్రవీణ్, జంగం గట్టమ్మ తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement