Thursday, May 16, 2024

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్

కరీంనగర్ పట్టణంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన ముగ్గురి కుటుంబీకులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. గత మూడు రోజుల క్రితం కర్ణాటక లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ ఇంజనీర్ కోల అన్నారెడ్డి కొడుకు ఆదిత్య కుటుంబాన్ని ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. అతి చిన్న వయసులో ఆదిత్య మృతి చెందడం తనను కలచి వేసిందని, భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, ఆదిత్య చిత్రపటం వద్ద ఎంపీ బండి సంజయ్ నివాళులు అర్పించారు. అనంతరం తండ్రి కోలా అన్నా రెడ్డిని, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రమాదానికి గల కారణాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. కాపువాడకు చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ తిరుమణి రాజేశం – కిషన్ ల మాతృమూర్తి అనారోగ్య కారణంతో మరణించడంతో వారి కుటుంబాన్ని ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. అలాగే సీనియర్ జర్నలిస్టు ఒంటెల కృష్ణ తల్లి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఎంపీ వెంట మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కార్పొరేటర్ కచ్చు రవి, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, బిజెపి జిల్లా ఎన్నికల సెల్ కన్వీనర్ బండ రమణా రెడ్డి, డా.పుల్లెల పవన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement