Saturday, May 18, 2024

సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

ఎల్లారెడ్డిపేట: గంబీరావుపేట మండలంలోని శ్రీ గాధ గ్రామానికి సమీపంలో ఎగువ మానేరు జలాశయానికి కాళేశ్వరం జలాశయం వరదనీరు కూడెల్లి వాగు ద్వారా చేరుకుంది. ఈ సందర్భంగా జాతీయ సహాకార సంఘాల సమఖ్య అధ్యక్షులు కోండూరి రవీందర్‌ రావు, టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య,గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటీ-సీలు, ఎంపిపిలు, పార్టీ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు మానేరు జలాశయానికి పూజలు నిర్వహించారు. ఆనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్‌, రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ చిత్ర పటాలకు జలశయంలో పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బొప్పాపూర్‌ మార్కెట్‌ కమిటీ- అధ్యక్షులు కొండ రమేష్‌గౌడ్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, మండల కో ఆప్షన్‌ సభ్యులు జబ్బర్‌, నాయకులు పిల్లి కిషన్‌, బండారి బాల్‌రెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, నర్సాగౌడ్‌, జవ్వాజీ లింగం, శ్యామంతుల అనిల్‌, యమగోండ పద్మా రెడ్డి, ఎలగందుల బాబు, న్యాలకంటి దేవేందర్‌, గంట బాల కిషన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement