Monday, May 13, 2024

కరీంనగర్ లో శ్రీరామ నవమి వేడుకలు

కరీంనగర్ నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండగలా సాగుతున్నాయి. శ్రీరామ నవమి సంధర్బంగా నగర మేయర్ యాదగిరి సునిల్ రావు 1,2 డివిజన్ల పరిదిలో గల తీగలగుట్ట పల్లి కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు మేయర్ సునిల్ రావుకు పూర్ణ కుంభ స్వాగతంతో ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం మేయర్ సునిల్ రావు సీతా రామ స్వామీని దర్శించుకొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. సీతా రాముల కళ్యాణం కోసం స్థానిక కార్పోరేటర్లు కొలగాని శ్రీనివాస్ మరియు కాశెట్టి లావణ్య, శ్రీనివాస్ లతో కలిసి మేయర్ సునిల్ రావు పట్ట వస్త్రాలు మరియు తలంబ్రాలను సమర్పించారు. ఆనంతరం ఆలయ పండితులు వేదమంత్రోచ్చరణలతో మేయర్ సునిల్ రావుకు సీతా రాముల కటాక్షంతో ఆశీర్వచనం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement