Thursday, May 9, 2024

విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట‌.. మ‌హిళ ఆత్మహత్యాయత్నం

జగిత్యాల : మల్లాపూర్ మండ‌లం కొత్త దాంరాజ్ పల్లిలో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కొత్త కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న ఏలేటి లక్ష్మి, నేవూరి లక్ష్మి అనే మహిళల ఇంటిపై నుంచి విద్యుత్ వైర్లు వెళ్లాయి. ఈ వైర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షకాలం ఇంటికి చాలా సార్లు విద్యుత్ షాక్ కూడా వచ్చిందని బాధితురాలు పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్న‌వించుకున్నారు. ఎంత‌కీ విద్యుత్ వైర్లు తొలగించలేరని సబ్ స్టేషన్ ఎదురుగా పురుగుల మందు డబ్బాతో మ‌హిళ‌ ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో స్పందించిన అధికారులు సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement