Thursday, May 2, 2024

రామగుండం ప్రజలపై నీ దయ చూపు తల్లి : ఎమ్మెల్యే కోరుకంటి

రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గామాత అమ్మవారిని ప్రార్థించారు. ఆదివారం స్థానిక పవర్ హౌస్ లోని దుర్గామాత ఆలయ 20వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగుండం ప్రజానీక సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రామగుండంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత నాలుగున్నర సంవత్సర కాలంలో రామగుండం నియోజకవర్గంను అభివృద్ధిలో సంక్షేమంలో ముందు వరుసలో నిలవడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పోరేటర్లు దాతు శ్రీనివాస్, బాలరాజు కుమార్, నాయకులు తోకల రమేష్ బిక్షపతి, దొమ్మేటి వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement