Saturday, April 20, 2024

గుర్ర‌పుస్వారీ చేస్తోన్న స‌మంత‌.. స్పందించిన రాశీఖ‌న్నా..ప్ర‌గ్యాజైస్వాల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగా ఉంది. రీసెంట్ గా మయోసైటిస్ సమస్య నుండి కోలుకోవడంతో తిరిగి తన ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలో సమంత తన ఇన్ స్టాలో లెటేస్ట్ ఫోటో షేర్ చేశారు. గుర్రంపై స్వారీ చేస్తున్న ఫొటోకు ‘ది బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూఆర్ బోత్’ అనే క్యాప్షన్ జోడించి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ రాశి ఖన్నా, ప్రగ్యా జైస్వాల్ కూడా స్పందించారు. సమంత ఫొటోకు లవ్ అండ్ ఫైర్ ఎమోజీలను జత చేశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటాడెల్ సిరీస్ షూటింగ్ సెట్ లో సమంత జాయిన్ అయ్యారు. త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్ కూ హాజరుకానున్నట్లు ప్రకటించడంతో సామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement