Tuesday, May 14, 2024

TS: మంత్రి పొన్నం స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు

రాజ‌న్న‌సిరిసిల్ల-రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం లో మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పర్యటించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ,ఇతర జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం నుండి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోకి మంత్రి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ముస్తాబాద్ జడ్పిటీసీ గడ్డం నర్సయ్య , ముస్తాబాద్ సింగిల్ విండో మాజీ చైర్మన్ అన్నం రాజిరెడ్డి ,మాజీ జడ్పిటీసీ యాదగిరి గౌడ్ ,ముస్తాబాద్ ఆలయ కమిటీ చెర్మన్ దేవయ్య ,మాజీ ఎంపిపి లక్ష్మి కిషన్ రావు ,అవునూరు సర్పంచ్ బద్ధి కళ్యాణి బాను ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు , గన్నెవరి పల్లి సర్పంచ్ అంజయ్య , బీఆరెస్ జిల్లా మహిళా నాయకురాలు మట్టా రాణి, కుర్ర సావిత్రి, కుర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు వందల సంఖ్యలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement