Monday, May 6, 2024

AP: అవ భూములలో క‌మీష‌న్లా… నిరూపించండిః చంద్ర‌బాబుకు ఎంపి భ‌ర‌త్ ఛాలెంజ్

రాజ‌మండ్రి – అవ భూముల్లో 150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలగుతాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌. రాజ‌మండ్రిలో నేటి ఉద‌యం మీడియాతో మాట్లాడుతూ, రీల్ ఎంపీ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఆలోచించాల‌ని సూచించారు. రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం పంతులు పార్క్‌ను ఎన్టీఆర్ పార్క్‌గా మార్చేశార‌ని ఇంత దుర్మార్గం మరొకటి లేదని దుయ్యబట్టారు భరత్. ఈ పార్క్‌కు తిరిగి ప్రకాశం పంతులు పార్క్‌గా మార్పు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కోరతామ‌ని అన్నారు. ఇక, విభజించిన రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టింది చంద్రబాబేన్న ఆయన పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు అంటూ మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు ఎవరితోనైనా చర్చకు సిద్ధం అన్నారు. సెంట్రల్ జైల్లో ఉండగా చంద్రబాబు కిటికీలోనుంచి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఉంటారన్నారు. పుష్కరాల్లో రెండు వేల కోట్లు తినేసింది చంద్రబాబు కాదా అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement