Saturday, April 27, 2024

అగ్ని ప్రమాదాలపై అవగాహన..

ఎల్లారెడ్డిపేట: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని సింగరేణి సూపర్‌ బజార్‌లో అగ్ని ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తగలపై అవగాహన కల్పించారు. అలాగే ఇలాంటి అపాయ సమయాల్లో స్పృహ కోల్పోయిన వారికి ఎలాంటి ప్రథమచికిత్స అందించడం, కృత్రిమ శ్వాస అందించడం, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడం వంటి విన్యాసాలు చూపించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని అగ్నిమాపక లీడింగ్‌ ఫైర్‌ మెన్‌ సత్తయ్య, డ్రైవర్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌, శ్రీహరి, సిబ్బంది శ్రీనివాస్‌, మోహిద్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement