Monday, April 29, 2024

దేవునిపల్లిలో గ్రామసభ

సుల్తానాబాద్‌: మండలంలోని దేవునిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. అలాగే ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ బాలాజీరావు పాల్గొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ లోకిని కోమలత, ఉపసర్పంచ్‌ స్వరూప్‌ గంగమ్మాల్‌, వార్డ్‌ మెంబెర్స్‌, తెరాస పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తూముల రామస్వామి, అంగన్వాడీ టీ-చర్‌ పుప్పాల రమాదేవి, ఆశవర్కర్‌, పోలవేణి నరేష్‌, రమేష్‌, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement