Wednesday, March 27, 2024

450 కోట్లు దక్కించుకున్న ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ..

ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ గా గుర్తింపు పొందిన దీని ధర అక్షరాల 450 కోట్లు. దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో  సుమారు ఏడు నెలల పాటు  కష్టపడి ఆయ‌న‌ ఈ పెయింటింగ్ వేశాడు బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ. ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ పేరిట దీన్ని రూపొందించాడు ఆర్టిస్ట్. కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో త‌న స‌మ‌యాన్ని ఈ పెయింటింగ్ కోస‌మే వినియోగించి‌న‌ట్లు ఆయ‌న తెలిపాడు. అయితే ఇప్పుడు దీనిని వేళం వేయగా భారీ ధరను దక్కించుకుంది. 62 మిలియన్ డాల‌ర్లకు అమ్ముడుపోయింది. ఇక ఈ పెయింటింగ్ కోసం ఏకంగా 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను ఆయ‌న వాడాడు. 70 ముక్కలుగా వేసిన‌ ఈ పెయింటింగ్ ను వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement