Wednesday, May 8, 2024

కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా విధ్వంసం: బండి సంజయ్‌

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని… అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటన్నారు.

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ అంతిమయాత్ర పేరుతో వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలు విధ్వంసం సృష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు- ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని కోరారు. శనివారం కరీంనగర్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement