Wednesday, May 8, 2024

కరోనా నియంత్రణకు టీకా శ్రీరామరక్ష..

రామగిరి: కరోనా నియంత్రణకు టీకా శ్రీరామరక్షగా నిలుస్తుందని ఆర్జీ3 జీఎం మనోహర్‌ పేర్కొన్నారు. ఆర్జీ3 ఏరియా ఓసీ2 గని కార్మికులకు జీఎం శానిటైజర్‌, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం రఘుపతి, టీబీజీకెస్‌ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, అధికారులు నరేందర్‌, రామారావు, గోపాల్‌, మారుతి, నాగేశ్వరరావు, లక్ష్మినారాయణ, రవి శంకర్‌, ఉప్పు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement