Monday, May 20, 2024

చెరుకు రైతుల ఛలో అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు

మెట్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిజాం చక్కెర కర్మాగారం పరిధి రైతులు చెరుకు ఉత్పత్తి దారుల సంఘం పిలుపు మేరకు ఈనెల 24న చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి చెరుకు రైతులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ చెరుకు రైతులకు మద్దతుగా తాము కూడా ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో గల రైతులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయడం ద్వారా కర్మాగారాన్ని తెరపించడానికి తమవంతు పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కొమిరెడ్డి లింగారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖుతుబొద్దిన్‌ పాషా, కిసాన్‌ సెల్‌ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల సంతోష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ యూత్‌ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆగ బాలయ్య, మహమ్మద్‌ ముఖీం, నాగరాజు, బాజిరెడ్డి, గంగారం, వెంకటరెడ్డి, అరుణ్‌, మహేందర్‌, హరీష్‌, అశోక్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement